జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయండి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం: హుస్నాబాద్ జనసేన ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను బలంగా తీసుకువెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు హుస్నాబాద్ మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, సైదాపూర్ మండల అధ్యక్షుడు పొడిశెట్టి విజయ్, ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు కల్లెపు అజయ్, భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు నద్దునూరి జయక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.