జనసేనతో గిరిజన అభివృద్ధికి బలమైన హామీ

*జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా

పలాస నియోజకవర్గం, ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మందసలో జరిగిన కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. గిరిజనుల హక్కులు కాపాడటం, భూముల రక్షణ, విద్య–వైద్యం–తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ప్రతి గిరిజన ప్రాంతానికి చేరేందుకు పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గిరిజన అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా మందస మండలాన్ని ఐటిడిఎగా ప్రకటించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

Share this content:

Post Comment