ప్లాస్మా డొనేషన్ పై అభిమానులకు సూపర్ స్టార్ పిలుపు… సిపి సజ్జనార్ కృషికి అభినందనలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అభిమానులకు, ప్రజలకు ప్లాస్మా డొనేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్లాస్మా డొనేషన్ పై ప్రజలలో ఎవేర్నెస్ తీసుకురావడానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేస్తున్న కృషిని మహేష్ బాబు అభినందించారు. ఈ మేరకు ఓ లేఖ ను మహేష్ బాబు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండడం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ప్లాస్మా డొనేషన్ ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలియజేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఈ ఎవేర్నెస్ తో ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అందరినీ అభినందిస్తున్నాను. సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడడానికి దోహదపడే ప్లాస్మా ను డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా నా బర్త్ డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్లాస్మా డొనేషన్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్ ను పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అభినందనలు. ముఖ్యంగా అనుక్షణం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, ఈ ప్లాస్మా డొనేషన్ గురించి ప్రజలకు చెప్తూ ఎందరో ప్రాణాల్ని కాపాడుతున్న సిపి సజ్జనార్ గారి కృషి ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కరోనా నుండి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు ప్లాస్మా డొనేట్ చేయండి, ఇంకొకరి ప్రాణాలు నిలబెట్టండి అని మహేష్ బాబు తన అభిమానులను, ప్రజలను విజ్ఞప్తి చేశారు.