సురుచి సందడి… నాదెండ్లకు బాహుబలి కాజా…

మండపేట నియోజకవర్గం, జనసేన పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటనలో భాగంగా ఇప్పనపాడు విచ్చేశారు. ఈ సందర్భంగా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో బాహుబలి కాజాను బహుకరించారు. మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, కందుల దుర్గేష్, పంతం నానాజీ తదితరులకు తాపేశ్వరం సురుచి సిబ్బంది స్వాగతం పలికారు. ఘనంగా సత్కరించి సురుచి బాహుబలి కాజాను సంస్థ పీఆర్ఓ ఉప్పలపాటి రామ్ భద్రిరాజు(వర్మ) అందజేశారు.