విజయనగరంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం, నెల్లిమెర్ల మండలంలో కొత్తపేట గ్రామంలో 50 మందికి క్రియాశిలక సభ్యత్వ కిట్ల పంపిణి చేయడం జరిగింది. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారి ఇంటికెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమణ సువ్వని మరియు జనసైనికులు పాల్గొన్నారు.