కార్యకర్తలను పలకరించడానికి జనసేనలో ముందుండే వ్యక్తి శ్రీపతి రాము

నెల్లూరు జిల్లా కలువాయిలోని మండలాధ్యక్షుడు పిరంకొండ మనోహర్ తమ్ముడికి యాక్సిడెంట్ లో కాలు విరిగింది. ఈ యాక్సిడెంట్ రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. అప్పుడు అతన్ని వెంటనే నెల్లూరు హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఈ విషయాన్ని మనోహర్ జిల్లాలో కొంతమంది ముఖ్య నాయకులకి తెలియజేసినా వాళ్ళు స్పందించ లేదు. కాని జిల్లాలో కార్యకర్తలకి ఏమి జరిగినా వెంటనే వారిని పలకరించడానికి జనసేనలో ఉన్న ఒకే ఒక వ్యక్తి శ్రీపతి రాము. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీపతి రాము స్పందించి.. మనోహర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని విధాలా భరోసా ఇచ్చారు. శ్రీపతి రాము పరామర్శించిన తరవాత మనోహర్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీపతి రాము, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నందున ముందుకు నడుస్తున్నాం అని తెలియజేసారు.