సువర్ణ భూమి నూతన ఒరవడి.. లోగో ఆవిష్కరించిన రాంచరణ్
సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన లోగో ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. మాదాపూర్లోని ఐటిసి కోహి నూర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నటుడు కె. రాంచరణ్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. లోగోను ఆవి ష్కరించి, కమర్షియల్ యాడ్ను లాంఛనంగా ప్రారంభించారు. బ్రాండ్ అంబాసిడర్ రాంచరణ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా సెలెక్టివ్గా ఉండటానికి యాడ్లు చేయటంలేదని, నమ్మకం అయిన సంస్థ కాబట్టి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. వేలాది మంది కస్టమర్లు కలిగిన సంస్థగా అందరిలో నమ్మ కం కల్గించిందన్నారు. పెద్ద ఎత్తున మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థ పని చేయటం గొప్ప విషయం అన్నారు.
కలకాలం కలిసి పనిచేసి బ్రాండ్ కు నమ్మకం కల్గిద్దామన్నారు. శ్రీధర్ మీదకూడా వినియో గదారులలో నమ్మకం ఉందన్నారు. ఓపెన్ ప్లాట్లు, ఫార్మ్ విల్లాలతో పాటు, అపార్ట్మెంట్ల రంగంలో సువర్ణ భూమి సంస్థ నూతన ఒరవడితో ముందుకెళ్తుందని సంస్థ ఎండి శ్రీధర్ పేర్కొన్నారు. రామ్ చరణ్ తమ సంస్థతో కలిసి పని చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న చరణ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విలువైన వినియోగదారుల అభి ష్టం మేరకు భవిష్యత్తులో మరిన్ని మంచి వెంచర్లను తీసుకు వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాడ్ డైరెక్టర్ కిషోర్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. యాంకర్ సుమ తన యాంకరింగ్తో నవ్వులు పూయించారు.