ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న సువర్ణరాజు
గోపాలపురం, దేవరపల్లి మండలం, దుద్దుకురు గ్రామంలో ఒకేచోట వినాయక, కుమారస్వామి, శివుని దేవాలయాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి సువర్ణరాజు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దుద్దుకురు గ్రామ అద్యక్షులు సాంబ శ్రీనివాస్, శివ, కంబాల సత్తిబాబు, సూరిశెట్టి బాలు, చిన్ని, జనసైనికులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-11.04.55-1024x461.jpeg)