స్వచ్ఛభారత్ – ఒక్క అడుగు స్వచ్ఛత వైపు

సర్వేపల్లి నియోజవర్గం: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ముత్తుకూరు మండలం బండ్ల పాలెం గ్రామం నందు ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ అంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్లాస్టిక్ నివారించడం. నూతన రాజకీయ వ్యవస్థలో యువతరానికి అవకాశాలు కల్పిస్తూ యువతని రాజకీయాల్లోకి నడిపిస్తూ కొత్త తరానికి నూతన రాజకీయ వ్యవస్థని పరిచయం చేయడమే స్వచ్ భారత్ లక్ష్యం. గ్రామపంచాయతీల్లో పంచాయతీ కాలువలు నిర్మాణం జరిగే గాని ఎక్కడ కూడా బ్లీచింగ్ కొట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుత వర్షాలు కారణంగా దోమలు వలన అంటురోగాలు రబలి ప్రజలు ప్రాణాలకి హాని కలిగే పరిస్థితిలో మనం గమనించవచ్చు. విపరీతంగా అంటురోగాలతో ప్రజలు అల్లరి పోతున్నారు. ప్రభుత్వ అధికారులు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులను చేపట్టవలసిందిగా జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రహీం, సర్వేపల్లి నియోజకవర్గ పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్, మండల కార్యదర్శి శ్రీహరి, పవన్ కళ్యాణ్ యువత ఉపాధ్యక్షుడు సుమన్, వెంకటేష్, అజయ్, సాయి, సీనయ్య, సురేష్, వంశి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.