ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం కార్యక్రమం 33వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, గాదెల వాగు గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 33వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గాదెల వాగు గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మాట్లాడుతూ పంచాయితీ వారు ఏర్పాటు చేసిన వీధి కుళాయిలలో నీళ్లు వచ్చిన పాపాన పోలేదు, ఎందుకు మరి పైపు లైన్లు వేయడం, వైసీపీ ప్రభుత్వంలో ప్రచారానికే పరిమితం అయింది తప్ప, ప్రజా అవసరాలమీద చిత్తశుద్ధి లేదని వాపోయారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ ఈ పరిస్థితులు మారాలనే, సామాన్యుడికి న్యాయం జరగాలనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. వ్యవస్థలో మార్పు కోసం, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు “గాజుగ్లాసు” కు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుందాం, సుసంపన్న పాలన అందిస్తాడు అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తాండ్ర శ్రీను, వెంకయ్య తదీరులు పాల్గొన్నారు.