రైతుభరోసా యాత్రకి తదేకం ఫౌండేషన్ విరాళం

రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రకు ప్రజల నుండి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బును కౌలు రైతులకు విరాళంగా ఇస్తూ.. మరింత మందికి మార్గదర్శకులగా నిలవడంతో.. పవన్ కళ్యాణ్ చేస్తున్న మహా యజ్ఞానికి నేను సైతం అంటూ తదేకం ఫౌండేషన్ వారు తమవంతు సహాయంగా చెక్కును ఆదివారం భీమవరం జనవాణి కార్యక్రమం అనంతరం తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీమతి మాదవి, శ్రీమతి సుధ జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అందించారు.