జనసైనికుని కుటుంబానికి అండగా నిలిచిన తాడిపత్రి జనసేన

తాడిపత్రి, పెద్దవడుగూరు మండలంలోని ముప్పాల గుత్తి గ్రామానికి చెందిన జనసైనికులు కే.శివ శంకర్ తండ్రి వెంకటేష్ కూలి పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదం జరగడంతో చెయ్యి విరిగడంతో కూలి పనికి వెళ్ళలేక పోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని అదే గ్రామానికి చెందిన కే.జయరామ్ అనే జనసైనికులు జనసేన పార్టీ తాడిపత్రి పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహాచారికి తెలియజేశారు. కుందుర్తి నరసింహాచారి వెంటనే స్పందించి కుమ్మేత ప్రతాప్ రెడ్డి, మేదర మురళి, జయరామ్, ప్రసాద్, పెద్ది రాజులతో చర్చించి వారి సహాయంతో ఆ కుటుంబానికి 25 కేజీ ల బియ్యంతో పాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను మరియు కొంత మేరకు ఆర్ధిక సహాయం చేయండి జరిగింది. ఆ విషయం తెలుసుకున్న ఆ గ్రామంలోని యువకులు జనసేన పార్టీ కార్యక్రమాల గురించి ప్రతీ నిత్యం చూస్తున్నామని ఈ సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ శంకర్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మధు, జయరామ్, రాజ శేఖర్, నాగేంద్ర, నాగార్జున, అశోక్, ప్రసాద్, రాజు, రంగస్వామి పాల్గొనడం జరిగింది.