రాయచోటి, రాజంపేట మధ్య రహదారి విస్తరణ చేపట్టండి: జనసేన డిమాండ్

  • రాయచోటి, రాజంపేట మధ్య రహదారి విస్తరణ మరియు వీరబల్లి క్రాస్, చెక్ పోస్ట్ వద్ద కొత్త రోడ్లకు సంబంధించి మధ్యలో ఉన్న ప్రమాదం చోటుచేసుకునే మలుపు, వంతెన వద్ద ఉండే ఇరుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జనసేన డిమాండ్??

రాజంపేట: జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ..అన్నమయ్య జిల్లా రాయచోటి రాజంపేట మధ్య మరియు నెల్లూరు, అనంతపురం, విజయవాడ, బెంగళూరు మధ్య కూడా రవాణా నిత్యం రద్దీగ వాహనాలు వెళ్ళే రహదారిలో వీరబల్లి క్రాస్ రోడ్డు కు చెక్ పోస్ట్ వద్ద కొత్త రోడ్డు కు మధ్యలో ఉన్నటువంటి వంతెన వద్ద మలుపు మరియు ఇరుకుగా ఉండడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి గనుక ప్రమాదం చోటు చేసుకునే ప్రాంత్తాన్ని అటువంటి ప్రదేశాలను గుర్తించి అదేవిధంగా నిరంతరం రద్దీగా ఉండే రహదారి ని పరిగణలోకి తీసుకుని సంబంధిత శాఖ అధికారులు అక్కడ సమస్యను దృష్టిలో పెట్టుకుని తక్షణ నిధులు కింద మంజూరు చేసి వంతెన మరియు రోడ్డు విస్తరణ మరమ్మతులు చేపట్టి యుద్ధప్రాతిపదికన వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.