తాళ్ళరేవు రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం

కాకినాడ జిల్లా తాళ్ళరేవు సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోని ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో రొయ్యల పరిశ్రమలో పని చేసే మహిళలు విగత జీవులయ్యారు. వారి ఆత్మకు శాంతికి కలగాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కష్ట జీవులైన ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలి. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైనవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను కోరుతున్నాను. రహదారి భద్రత చర్యలపై రవాణా, పోలీసు శాఖలు ప్రత్యేక దృష్టిపెట్టాలి. అలాగే నంద్యాల జిల్లాలో అవుకు జలాశయంలో పర్యాటక శాఖ పడవ బోల్తాపడి ఇద్దరు మృతి చెందటం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.పర్యాటక ప్రదేశాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోమారు గుర్తుచేస్తోందని జనసేనాని పేర్కొన్నారు.