తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: 8వేలకు పైగా ఆధిక్యంలో వాణీదేవి

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి మొత్తం ఇప్పటి వరకు 1,15,043 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు 1,06,565 ఓట్లు సాధించారు. ఇక స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ 55,742 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 32,879 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో 86 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవి 8,478 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.