మణిపూర్లో ఉగ్రవాదులు బీభత్సం..!
మణిపూర్లో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో గ్రామ పెద్ద సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రాష్ట్రంలోని కాంగ్పోక్సి జిలల్లా బీ గమ్మోమ్ ప్రాంతంలో కుకీ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎంపీ ఖుల్లెన్ గ్రామ పెద్ద, మరో నలుగులు మరణించారు. మృతుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మిలిటెంట్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు.
కాగా, గత ఆదివారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో నలుగురు కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల అంత్యక్రియలను గ్రామస్థులు నిర్వహిస్తుండగా మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని స్థానికులు వెల్లడించారు.