సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్.. ఆగిన 120 నౌకలు

సూయజ్ కాలువలో లో చిక్కుకుపోయిన భారీ నౌక ఇప్పుడు విపరీతమైన కష్టాలు తెచ్చిపెడుతోంది. నౌక కాలువలు అడ్డంగా ఉండిపోవడంతో రవాణా రవాణా వ్యవస్థ స్తంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొన్ని వందల కొద్ది చిన్న నౌకలు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆగిపోయిన ఆ ప్రాంతాన్ని సాటిలైట్ ఫోటోలు తీసి పంపింది. కెనాల్ లోని ఇసుక మేటల్లో నౌక అడ్డుగా చిక్కుని పోగా, ఎన్నో దేశాలకు చేరుకోవాల్సిన నౌకలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు విడుదల అయ్యాయి. దాదాపు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నౌకలు ముందుకు సాగేందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.

ఈ కృత్రిమ వాణిజ్య నౌకా మార్గం ఎన్నో దేశాల అవసరాలను తీరుస్తున్నదన్న సంగతి తెలిసిందే. ఇసుక మేటల్లో చిక్కుకున్న నౌకను తొలగించేందుకు దాదాపు 5 రోజులుగా సాగుతున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతూ ఈ కెనాల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ సుమారు 9.6 బిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని, ఆసియా, యూరప్ దేశాల మధ్య వాణిజ్యానికి విఘాతం కలిగిందని అధికారులు అంటున్నారు. ఈ విషయమై సూయజ్ కెనాల్ అథారిటీ చీఫ్ ఒసామా రాబీ స్పందిస్తూ, ఈ ప్రమాదం కారణంగా తమకు రోజుకు 14 మిలియన్ డాలర్ల ఆదాయ నష్టం సంభవిస్తోందని, నౌకను పక్కకు తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. సాంకేతిక టీమ్ లు ఈ విషయమై నిర్విరామంగా కృషి చేస్తున్నాయని, అయితే, బలమైన గాలులు, వాతావరణ పరిస్థితులు కొంత అడ్డంకిగా మారినా, సాధ్యమైనంత త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నామని తెలిపారు.