ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి

  • మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా అల్లంగి రామకృష్ణ

అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలం పెద్దలబ్బుడు పంచాయతీ పరిధిలో గల గరడగూడ గ్రామంలో జనసెన నాయకులు మరియు మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ, కొర్ర బంగార్రాజు ఆధ్వర్యంలో శనివారం ఆయా గ్రామాల్లో ఏడు గంటల సమయంలో సందర్శించి, ముందుగా గ్రామ ప్రజలతో సమావేశమై సమస్యల పట్ల చర్చించారు. గ్రామంలో హౌసింగ్ బిల్లులు బాధితులకు నేటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ గృహానికి చెల్లించలేదని గిరిజనులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ళ పట్టాలిచ్చి ఇళ్ళు నిర్మించి ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారని తెలిపారు. దీనికి స్పందించిన జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గిరిజనుల సమస్యలను పరిష్కారం చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో గిరిజనులతో పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.