వినాయక నిమజ్జనాలు పై హైకోర్టు సీరియస్

వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను హై కోర్ట్ రిజర్వ్ చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.జీహెచ్ఎంసీలో 48 చెరువులు,కొలనుల్లోనూ నిమజ్జనం ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం తెలిపింది.

మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని..లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.సలహాలు కాదు..చర్యలు,స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది.నిమజ్జనం ఆంక్షలు,నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది.