ఆరవ రోజుకి చేరుకొన్న దీక్షలు

ధవళేశ్వరం గ్రామ సమస్యలపై అఖిలపక్షం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి ఆరు రోజులు పూర్తయ్యాయి. కాగా మంగళవారం దీక్షలో పూర్తిగా జనసేన నాయకులు కూర్చున్నారు. సాయంత్రం వారికి జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే రేపటినుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.