గల్ఫ్ బాధితుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని జనసేన వినతి

రాజంపేట, గల్ఫ్ బాధితుల విషయమై అన్నమయ్య జిల్లా ఎస్పిని, ఏఎస్పిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖరంచాన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టకూటి కోసం గల్ఫ్ కు వలస వెళ్ళే కార్మికులలో ఎక్కువ శాతం ఉమ్మడి కడప జిల్లాలోని కొన్ని మండలాలు అలాగే నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ఎక్కువశాతం మంది ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఏజెంట్ల బారినపడి సరైనా ఆధారపూరిత పత్రాలు లేకుండా అక్కడ జైలులో మగ్గిపోయి, తిరిగి స్వదేశానికి చేరుకుని అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దురదృష్టకరమని, బాధాకరమని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర జనసేనపార్టీ కార్యదర్శి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరంచాన్, రాయచోటి జనసేనపార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ హసన్ బాషా మరియు జనసేనపార్టీ కువైట్ ఎన్నారై అలి షేక్ మరియు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు రామశ్రీనివాసులు, పఠాన్, నవీన్, షబ్బీర్, రియాజ్ తదితరులు పాల్గొని జనసేనపార్టీ తరుపున ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరడం జరిగింది.