బై జూస్ కు ఎంపికైన విద్యార్థిని సన్మానించిన రాయచోటి జనసేన

రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ షైక్ హసన్ భాషా ఆదేశాలతో పార్టీ కార్యాలయ సెక్రెటరీ షైక్ రియాజ్ నేతృత్వంలో బైజూస్ కు ఎంపికైన విద్యార్థి పగడాల రెడ్డి శేఖర్ ను జనసేన పార్టీ నాయకులు రామశ్రీనివాసులు సమక్షంలో పి. రెడ్డి శేఖర్ ను సెల్వ, పూలమాలతో సత్కరించి అభినందిస్తూ స్వీట్ తినిపించి ఘనంగా సన్మానించారు.
ఆయన మాట్లాడుతూ రాయచోటి సాయి కళాశాలలో తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనందించే విదంగా ఉన్నత స్థాయి కి ఎదగాలని పట్టుదలను గౌరవిస్తూ ఇటువంటి విద్యార్థిని స్పూర్తితో మాధ్యమాలను ఆదర్శంగా తీసుకుని ప్రోత్సహిస్తూ విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చుదువుకుని విద్యారంగంలో ప్రతిఒక్కరూ పోటీతత్వంతో ఉన్నత స్థాయి చదువులతో ప్రతి ఒక విద్యార్థినులు, విద్యార్థులు రాణించాలని పేర్కున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రామశ్రీనివాసులు, షైక్ రియాజ్, మైనార్టీ నాయకులు మౌలానా రసిద్ అహ్మద్, మదన్ కుమార్ జనసైనికులు, ఖాసిమ్, సబీర్, నిజాం, అఫ్సర్ తదితరులు అభినందనలు తెలుపుతూ పాల్గొన్నారు.