రక్తదానంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది

బొబ్బిలి గ్రామనికి చెందిన పానీపూరి బడ్డీని నడుపుకొని కొల్లివలసలో బ్రతుకుతున్న వీరమహిళ సత్యవతి కి కాళ్ళకి ఆపరేషన్ నిమిత్తం అత్యవసర సమయంలో రక్తం అవసరం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆముదాలవలస నియోజకవర్గం చిన్నలంకం గ్రామానికి చెందిన జనసైనికుడు జయరాం తమ్ముడు రక్తదానం చేయడం జరిగింది. సమయానికి బ్లడ్ ఇచ్చి మా కుటుంబానికి చాలా సాయం చేశారు అని ఈ సందర్భంగా కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాగోలు బ్లడ్ మేనేజర్ మహేష్, మోహన్ మరియు ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ పాల్గొన్నారు.