విద్యార్థి అమర్నాధ్ సజీవ దహనం క్షమించరాని నేరం..

  • జనంలోకి జనసేన జనం కోసం జనసేన కార్యక్రమంలో విడివాడ రామచంద్ర రావు

తణుకు నియోజకవర్గం: తణుకు మండలం, యర్రాయి చెరువు గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ.. రేపల్లె నియోజకవర్గం, చెరుకుపల్లి మండలం, రాజోలు గ్రామంలో వైసిపి అల్లరి మూకలు అమర్నాథ్ గౌడ్ అనే పదో తరగతి చదివే బీసీ బాలుడిని సజీవ దహనం చేయడం క్షమించరాని నేరమని విడివాడ అన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదేనా పెద్దపీట అన్నారు. అమర్నాథ్ గౌడ్ అక్కను వెంకటేశ్వర రెడ్డి అనే వైసీపీ వ్యక్తి వేధిస్తున్నాడని వెంకటేశ్వర రెడ్డిని మందలించడంతో కక్ష పెంచుకుని పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం చాలా దారుణమని, వైసిపి రౌడీల అరాచకానికి ఇదొక నిదర్శనం అని అన్నారు. దీనికి బాధ్యులైన వెంకటేశ్వర రెడ్డిని కఠినంగా శిక్షించాలని విడివాడ రామచంద్రరావు జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని తణుకు నియోజవర్గ ఇన్చార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, యర్రయ్య చెరువు జనసేన పార్టీ నాయకులు పెచెట్టి నాగేశ్వరావు, పాల శివకృష్ణ, కేత శ్రీనివాస్, పాల నాగయ్య, ఇరగవరం మండలం అధ్యక్షులు ఆకెట్ కాశి, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ తామరపు నరసింహారావు, జనసేన పార్టీ తణుకు మండలం ఉపాధ్యక్షురాలు తెలగరెడ్డి లక్ష్మి, తణుకు పట్టణం యూత్ అధ్యక్షులు గర్రె తులసీరామ్, మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు కార్యకర్తలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.