రంజాన్‌, అక్షయ తృతీయ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

ఈద్‌ -ఉల్‌- ఫితర్‌, అక్షయ పర్వదినాన్ని తృతీయ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు సుఖః సంతోషాలు, ఆరోగ్యంతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. సమష్టి కృషితో కరోనా మహమ్మారిని అధిగమించి మానవ సంక్షేమాన్ని పెంచే దిశగా పాటుపడాలని ప్రజలకు సూచించారు. ‘ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరి ఆరోగ్యం బాగుండాలని, కలికట్టుగా అందరం మహమ్మారిని జయించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా’.. ఈద్‌ ముబారక్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

‘దేశవాసులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శుభకార్యాల సాధనతో ముడిపడి ఉన్న ఈ పవిత్ర పండుగ కరోనా మహమ్మారిని జయించాలనే మన సంకల్పాన్ని గ్రహించే శక్తిని ఇవ్వాలి’ అంటూ మరో ట్వీట్‌ చేశారు. అలాగే బసవ జయంతి సందర్భంగా సైతం శుభాకాంక్షలు తెలిపారు. ‘బసవేశ్వరుడి గొప్ప బోధనలు, ముఖ్యంగా సామాజిక సాధికారత, సామరస్యం, సోదరభావం, కరుణకు ప్రాధాన్యత ఇవ్వడం.. అనేక మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.