పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం రెండవ విడత

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం రెండవ విడతలో భాగంగా ఈ నెల 18వ తేది నుంచి ఫిబ్రవరి 2వ తేది వరకు బిజినపల్లి మండలంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేయనున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం ద్వారా పాదయాత్ర చెప్పట్టడం జరిగింది. దీనిలో భాగంగా కిందటి సంవత్సరం డిసెంబర్ 26వ తేది నుండి జనవరి 12 వ తేది వరకు మొదటి విడతగా తెలకపల్లి మండలం విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండవ విడతగా బిజినపల్లి మండలంలో ఈ నెల 18 వ తేది నుంచి ఫిబ్రవరి 2వ తేది వరకు వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టడం జరగనున్నది. కనుక ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా, నియోజకవర్గ నాయకులు, బిజినపల్లి మండల నాయకులు, జనసైనికులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నామని నాగర్ కర్నూల్ జనసేన నాయకులు పత్రికాముఖంగా కోరడం జరిగింది. ఈ సందర్భంగా బిజినపల్లి మండల పరిధిలో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ
• బిజినపల్లి మండలంలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వంగ లక్ష్మణ్ గౌడ్ ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని,
• ప్రతి పల్లెకు పవనన్న జెండతో లక్ష్మణ్ గౌడ్ బిజినపల్లి మండలంలోని అన్ని గ్రామాలు పాదయాత్రగా రానున్నారని,
• బిజినపల్లి మండల ప్రజలు జనసేన పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము అన్నారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు హారి నాయక్ భోట్కా రమేష్, బోనాసి శివ, రాజు నాయక్, సూర్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.