ఓపెన్ కానున్న థియేటర్లు

కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలతో వ్యాపారాలు తీవ్ర నష్టాల్లో చిక్కుకున్నాయి. ఇందులో ప్రధానంగా థియేటర్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో నష్టాల్లో ఉన్నాయి. అ యితే యజమానులు థియేటర్ల పునఃప్రారంభానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కనీసం అక్టోబర్‌లో దసరానాటికైనా తమ థియేటర్లు నడవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశంలోని థియేటర్ యజమానులు దసరాకి ముందు థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు ప్రాంతాల్లోని ఫిల్మ్ ట్రేడ్ సభ్యులు, సినిమా, మల్టీప్లెక్స్ యజమానులు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను కలిసారు. వారిచ్చిన హామీ మేరకు రానున్న రెండు రోజుల్లో మంచి వార్తను వింటామని ఆశతో ఉన్నారు.