జూమ్‌ వేదికగా నేడు ఎస్పీ బాలు జయంతి సభ

తెలుగు సాహిత్య వారధి సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సభను ఆన్‌లైన్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు బాధ్యులు అట్లూరి వెంకటరమణ తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, గౌరవ అతిథులుగా రచయితలు రామజోగయ్యశాస్త్రి, తనికెళ్ల భరణి, చంద్రబోస్‌, బుర్రా సాయిమాధవ్‌, అనంత శ్రీరామ్‌ తదితరులు హాజరవుతారన్నారు. తెలుగు కవులు, రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.