నేడు వనస్థలీపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం
నగరంలోని వనస్థలీపురం రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉదయం 10గంటలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరై లబ్ధిదారులతో ప్రారంభోత్సవం చేయించనున్నారు. రూ.28కోట్ల వ్యయంతో 324 రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరుకానున్నారు.