వంగవీటి మోహన్ రంగా మరియు అల్లూరి సీతారామరాజు లకు ఘన నివాళి

పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వంగవీటి మోహన్ రంగా ల జయంతిని పురస్కరించుకొని పిడుగురాళ్ల మండల జనసేనపార్టీ ఆఫీస్ నందు, వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్,జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసీం సైద, మహిళా నాయకురాలు శింగంశెట్టి వెంకట రమణ, నాయకులు బయ్యవరపు రమేష్, చేదెళ్ల రామకృష్ణ, బేతంచర్ల ప్రసాద్, మట్టం పరమేష్, షేక్ వలి, రవి, నాగేశ్వరావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.