TTD వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్ల కోటా విడుదల..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన లక్షలాది భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు పోటెత్తుతారు. ఈ నేపధ్యంలో భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను.. భక్తుల సౌకర్యార్ధం రోజుకు 20 వేల చొప్పున ఆన్లైన్లో విడుదల చేసింది. అలాగే భక్తులకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించింది. తిరుమలలో డిసెంబర్ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనుంది.