నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన యు.పి.రాజు
రాజాం: విజయనగరం జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ పలు సమస్యలు మనోహర్ కు వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలో జరగబోయే శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రాజాం నియోజకవర్గం ప్రత్యేకంగా వస్తామని తెలియజేసారు. యు.పి. రాజుతో పాటు నాయకులు సామంతుల రమేష్, కుమారి, నాగరాజు, హరిబాబు మరియు మండల నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-26-at-7.56.14-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-26-at-7.56.15-PM-768x1024.jpeg)