భారత్ నుంచి విమాన ప్రయాణాలపై యూఏఈ ఆంక్షలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి విమాన ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా అనుమతించబోమని తెలిపింది. అయితే యూఏఈ నుంచి విమానాలు, కార్గో రాకపోకలు కొనసాగుతాయని పేర్కొంది.

మనోవైపు యూఏఈ పౌరులు, దౌత్య అధికారులు, సిబ్బంది, వ్యాపార వేత్తల విమానాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే వీరంతా పది రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని, వచ్చిన రోజుతోపాటు, తర్వాత 4, 8 రోజుల్లో పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. ఈ కేటగిరి వ్యక్తుల ప్రయాణాలకు ముందుగా చేయించుకున్న కరోనా పరీక్ష గడువును 72 గంటల నుంచి 48 గంటలకు కుదించింది. కేవలం అనుమతించిన ల్యాబ్ రిపోర్టులను మాత్రమే అంగీకరిస్తామని ప్రకటించింది.