ఉర్దూ ప్రాథమిక పాఠశాలను తక్షణమే బాగు చేయాలి: జనసేన డిమాండ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలంలోని గురువారం ఉర్దూ ప్రాథమిక పాఠశాల నందు జరిగిన సంఘటన గురించి జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి రేఖగౌడ్ శుక్రవారం కర్నూలు నగరం నందు డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రంగారెడ్డి గారిని కలిసి జరిగిన సంఘటనను గూర్చి వివరించి తక్షణమే స్కూలు బాగు చేయాలి అని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళలు లక్ష్మి, లలిత, ప్రియా మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకులు ముని స్వామి, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.