ఈతకోట జెడ్పీ స్కూల్ సభా వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వంటపల్లి

  • మురళీకృష్ణ సంస్థల అధినేత పాపారావు ఆర్థిక సాయంతో చేపట్టనున్న నిర్మాణం పనులు
  • దాతను అభినందించిన పలువురు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం పాఠశాలలో స్టేజీ వేదిక నిర్మాణానికి సహాయ సహకారాలను అందించి నడుంబిగించిన దాత మానవత్వం చాటుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వంటపల్లి పాపారావు మండలం పరిధిలోని ఈతకోట జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్మించనున్న సభా వేదిక నిర్మాణానికి శంఖుస్థాపన నిర్వహించారు. దాత మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు ఆర్థిక సాయంతో నిర్మించే ఈ వేదికకు బుధవారం ఉదయం పాపారావు చేతులు మీదుగా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 2.50 రూ.లక్షలతో వేదిక నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి సుబ్బలక్ష్మి నాగేశ్వరరావు(బుజ్జి), ఉప సర్పంచ్ ఏనుగుపల్లి నాగార్జున, ఎంపీటీసీలు బొరుసు సీతారత్నం, వత్సవాయి హరిబాబు, పాఠశాల ఛైర్మన్ బండారు తేజ, మట్టా సత్తిబాబు, యర్రంశెట్టి కాళీకృష్ణ, వత్సవాయి కృష్ణంరాజు, మాసాబత్తుల ఆనందరావు, వెలుగట్ల రామకృష్ణ, కముజు గణపతి, యర్రంశెట్టి రాము గ్రామ కార్యదర్శి మహ్మద్ అన్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి, పిఈటి టేకి రామకృష్ణ, ఏనుగుపల్లి వెర్రియ్య (వైవి), వార్డు సభ్యులు దునబోయిన వెంకటరమణ, మిరియాల రాము, మానే నాగార్జున, మోటూరి సుబ్బలక్ష్మి, బొరుసు గోవిందు, మానే రామకృష్ణ, బోడపాటి రాంబాబు, జనిపిరెడ్డి వెంకటేశ్వరరావు, మానే ప్రసాద్, కొండేటి సత్యనారాయణ, గుబ్బల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.