కర్నూల్ జిల్లాకు కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వరదయ్యపాలెం జనసేన డిమాండ్

సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో కర్నూల్ జిల్లాకు భారత దేశ మొట్ట మొదటి దళిత ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య పేరును ప్రకటించాలని చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అనుమతితో వరదయ్యపాలెం బస్టాండ్ సెంటర్లో వైసీపీ ప్రభుత్వానికి విన్నవించుటు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శులు లావణ్య కుమార్, హేమకుమార్, వరదయ్యపాలెం మండలం అధ్యక్షుడు చిరంజీవి యాదవ్, ఆరు మండల అధ్యక్షులు అయినటువంటి రూపేష్, మణి, థామస్, సుమన్, భాషా, దేవ ప్రశాంత్, వరదయ్యపాలెం మండల కమిటీ సభ్యులు జనసైనికులు సమక్షంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి సత్యవేడు నియోజకవర్గ జనసేన పార్టీ హెచ్చరించడం ఏమనగా ఫిబ్రవరి 14 సంజీవయ్య జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఆయన పేరు ప్రకటించని ఎడల జయంతి రోజున సత్యవేడు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో జనసేన పార్టీ నిరాహార దీక్షకు పూనుకుంటామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో దినేష్ కులశేఖర్ రెడ్డి శేఖర్ ఫజల్ రెహమాన్, నాగేంద్రబాబు, నాగేంద్ర, ఫజల్ ముల్లంగ్, వసంత మునీంద్రా యుగంధర్, విష్ణు, స్వరూప్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.