మదనపల్లె జిల్లా కావాలని జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ

మదనపల్లె జిల్లా సాధన సమితి మరియు జనసేన రాయల సీమ కో కన్వినిర్ గంగరావు రామదాసు చౌదరి ఆధ్వర్యంలో అఖిలపక్షం పార్టీల కులసంఘాలు మైనార్టీ నాయకులు మదనపల్లెలో సాంస్కృతిక కార్యక్రమాలతో భిటి కాలేజ్ నుండి ర్యాలీగా బెంగళూర్ బస్టాండ్, టౌన్ బాంక్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్లో సభ నిర్వహించడం జరిగింది. మదనపల్లె జిల్లాకు కేంద్రంగా ప్రకటించాలని, పుంగనూరు పీలేరు తంబల్లపల్లె ప్రజలు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున జనసైనికులు పాల్గొన్నారు