భక్తులు లేకుండానే… తిరుమలలో ప్రారంభమైన వసంతోత్సవాలు

తిరుమలలో నిర్వహించే సాలకట్ల వసంతోత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో, భక్తులకు అనుమతి ఇవ్వకుండానే ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. అలయంలో ఉన్న కల్యాణోత్సవ మండపం ప్రాంగణంలో మూడు రోజుల పాటు వసంతోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే బంగారు రథంపై మలయప్పస్వామి ఊరేగింపును అధికారులు రద్దు చేశారు. కాగా, తిరుమలలో రద్దీ సాధారణం కన్నా తగ్గింది. నిన్న స్వామివారిని దాదాపు 15 వేల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.