సుభద్ర పురం గ్రామ ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలం సుభద్రాపురం గ్రామంలో సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు మరియు జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు శనివారం ప్రజలవద్దకు వెళ్లి.. వారిని నేరుగా పలకరిస్తూ.. ఘనంగా పవనన్న ప్రజాబాట చేపట్టారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యం అంటూ.. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు చేపట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా.. నేడు నియోజకవర్గంలో ప్రతి చెరువులో ఉన్న ప్రజలను కలవడం జరిగింది. ఇంటింటికి తిరిగే పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 47 రోజులు పాటు సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్లి పలు కుటుంబాలను పలుకరిస్తూ.. ముందుకు సాగడం జరిగింది.

ఈ సందర్భంగా కరిమజ్జి మల్లీశ్వారావు, పోట్నూరు లక్ష్మునాయుడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే లక్ష్యంతో తాము ప్రారంభించిన పవనన్న ప్రజాబాటకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈ సారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు.

ఈ కార్యక్రమంలో సుభద్ర పురం గ్రామ పెద్దలు, మహిళలు ప్రజలు మరియు పంపురెడ్డి ఆదినారాయణ పాల్గొన్నారు.