గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు అర్పించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పూల మాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ కన్న కలలు నెరవేరాలంటే, గ్రామ స్వరాజ్యం సహకారం కాలవంటే పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వం వహిస్తేనే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి పట్టణం ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శులు పేట చిరంజీవి, ముడుసు గణేష్, పేట చంద్ర శేఖర్, రవికుమార్ రెడ్డి, నాయకులు వెంకట రమణ యాదవ్, దినేష్, ఉదయ కుమార్, గురవయ్య, జ్యోతి రామ్, జనసైనికులు పాల్గొన్నారు.