వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలి

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలోని వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద 159వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ని వెలిగించి, శ్రీ స్వామి వివేకానంద చిత్ర పటానికి పువ్వులమాల వేసి ఘన నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకులు మత్స్యపుండరీకం మాట్లాడుతూ నేటి విద్యార్థులు, యువతి, యువకులు వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వివేకానందను మరియు దేశ నాయకులను ఆదర్శంగా తీసుకొని నేటి యువతకు, విద్యార్థులు పాతికేళ్ళ బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధు పోలి నాయుడు, వాన మహేష్, వావిలపల్లి నాగభూషణం, కర్ణీన పవన్ సాయి వజ్రగడ్డ రవి కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.