భీమిలి జనసేన ఆధ్వర్యంలో వాలీ బాల్ టోర్నమెంట్

భీమిలి నియోజకవర్గం: భీమిలి 7వార్డు వంబాయ్ కాలనీ నో కాంప్రమైజింగ్ యూత్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని
బుధవారం నుంచి 3రోజుల పాటు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహిస్తున్నట్టు టోర్నమెంట్ నిర్వాహకులు తెలియజేసారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిలుగా
జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ మహిళ నాయకులు ఒమ్మి దేవి యాదవ్, బీజేపీ మండల ప్రెసిడెంట్ బండారు అనిల్ కుమార్, కనక దుర్గ సప్లయర్ అధినేత
కొర్రాయి సురేష్, జనసేన నాయకులు సాగర్ మల్ల, ఆకుల శివ, యార్ల విజయ్ కుమార్
హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒమ్మి దేవి యాదవ్ మాట్లాడుతూ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, యువత చెడు వ్యసనాలు భారీ పడకుండా క్రీడలపై మక్కువ చూపించేందుకు కూడా ఇటువంటి టోర్నమెంట్ లు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేసారు. క్రీడాకారులు గెలుపు ఓటములు పక్కనపెట్టి సోదర భావంతో ఈ టోర్నమెంట్ పాల్గొన్నా ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాలక శ్యామ్, ఆకుల విజయ్, వేణిగాల శ్రీనివాస్, వావిలాపల్లి చిన్న, ఆశరాజ్, పాలక దినేష్, గేదెల శ్రీను, తులసి దుర్గాప్రసాద్, వినోద్, సాయితేజ, మోహన్, వెంకట్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.