రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా మంగళవారం మలికిపురం గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి కేశనపల్లికి చేందిన ప్రముఖ పెద్దలు అడబాల శ్రీఆంజనేయులు & సన్స్ ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా మలికిపురం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం అన్నారు. ఈ కార్యక్రమంలో మలికిపురం జనసైనికులు పాల్గొనడం జరిగింది.