విద్యార్ధులకు అండగా ఉంటామని హామీ

ఎల్బినగర్, కొద్దిరోజుల క్రితం దిల్ షుక్ నగర్ లోని ఎస్సీ స్టడీ సర్కిల్ పొడిగింపు కోసం విద్యార్థుల చేసిన ధర్నాకు జనసేన సంఘీభావం తెలియజేసిన విషయం తెలిసినదే. సోమవారం స్టడీ సర్కిల్ బిల్డింగ్ నుండి విద్యార్థులను బయటకి నెట్టి స్టడీ సర్కిల్ ముసివేశారని విద్యార్థులు జనసేన దృష్టికి తిసుకువచ్చిన వెంటనే స్టడీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారికి భోజనం ఏర్పాటు చేసి అండగా ఉంటామని జనసేన పార్టీ ఎల్బినగర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సాయి శిరీష పొన్నూరు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి నిర్విరామంగా మంది 100 పిల్లలకు అండగా నిలిచిన నియోజకవర్గ నాయకులు శ్రీను, అక్షయ్, రాజు, సాయికుమార్, మధు, రామకృష్ణ, వరుణ్, బ్రహ్మాజీ, తాతాజీ, హరిబాబు, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.