వరల్డ్ ఫొటోగ్రఫీడే సందర్భంగా తానూ తీసిన మొదటి రెండు ఫొటోలను షేర్ చేసిన చిరంజీవి

ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించిన చిరంజీవి యమ యాక్టివ్‌గా ఉంటూ… తన వ్యక్తిగత విషయాలు,  ప్రస్తుత పరిస్థితులు, స్పెషల్ డేస్ అన్నింటిపై స్పందిస్తూ డిజిటల్ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక వింటేజ్ ఫొటోను షేర్ చేసి ఇది తాను తీసిన మొదటిఫొటో అని పేర్కొంటూ ‘ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చూద్దాం’’ అని అభిమానులను ప్రశ్నించారు చిరంజీవి.

అయితే ఈ ఫొటో చూసిన నెటిజన్లు చిరంజీవి ప్రశ్నపై పెద్దఎత్తున రియాక్ట్ అయ్యారు. ఆ ఫోటో చూసి ఎంజాయ్ చేస్తూ.. ఇంకెవరు ఆ ఫొటో ఉన్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ ఐదుగురిలో సరిగ్గా మధ్యలో ఉన్నాడు అంటూ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల స్పందనపై హ్యాపీగా ఫీల్ అయిన చిరంజీవి.. ”ఎస్..మీ గెస్ రైట్. ఆ ఐదుగురు మధ్యలో ఉన్న మూడో వ్యక్తి నా చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్. ఇది నేను తీసిన రెండో ఫోటో. మా నాన్నగారు” అంటూ మరో వింటేజ్ ఫొటో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.