విశ్వబ్రాహ్మణ కుటుంబాలతో ముచ్చటించిన ముత్తా శశిధర్

కాకినాడ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ సిటిలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ముంతా వీరభద్రరావు ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కుటుంబాలను మహాలక్ష్మీనగర్ ప్రాంతంలో కలిసి వారితో వారి కుటుంబాలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాత్లాడుతా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ నాయకులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారు సామాజికంగా అన్ని కులవృత్తుల వారినీ కలిసి వారి వారి సమస్యలను, అవసరాలను గుర్తించి పార్టీకి తెలియచేసి తద్వారా వాళ్ళను కులవృత్తులను కాపాడాలని బాధ్యతని అప్పచెప్పారన్నారు. అందులో భాగంగా నగరంలో అన్ని కులవృత్తుల వారినీ కలవడం చేస్తున్నా అన్నారు. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ప్రధానంగా కోరుకుంటున్నది ఊర్లలో అద్దెలు బాగా పెరిగిపోయాయి షాపులను తీసుకునే పరిస్థితులలో లేరనీ వారు వారి వృత్తిపరంగా పనిచేసుకోడానికి ఒక స్థలం కావాలి అందుకు అవసరమైన అద్దెలను భరిస్తామనీ వృత్తిలో పనులు తగ్గాయనీ మరల కొత్తగా వచ్చిన బంగారు ఆభరణాల షాపుల్లో కూడా వీరికి ఉపాధి కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియచేయడం జరిగిందన్నారు. కాకినాడలాంటి నగరంలో అన్ని రకాల కులాలు తమవృత్తులని చేసుకుంటూ జీవనం సాగించాయని, ప్రస్తుత నగరీకరణలో జరుగుతున్న మార్పులలో కులవృత్తుల వారినందరినీ కాపాడుకోవాలిసిన అవసరం నగర ప్రజలకీ మరియు రాజకీయ పార్టీలకీ ఎంతైనా ఉందనీ జనసేన పార్టీ ఇందుకు తగినట్టుగా వీరందరూ సమాజంలో గౌరవంగా బ్రతికేవిధంగా తగువిధంగా పాటుపడుతుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ముంతా బద్రి, ముంత లక్ష్మణరావు, అడ్డాల శివశంకర్, కొడగాలి కొండబాబు, పూడి మధు, ఆవుపాటి నూకరాజు, జి కృష్ణ, జి రామకృష్ణ, కొప్పాడి రమణ, కందాల రామారావు, మండల శ్రీనివాస్, బలసరి ప్రసాద్, కడారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.