శిరివెళ్లలో ఘనంగా 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శిరివెళ్ళ జనసేన పార్టీ కార్యాలయంలో 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిరివెళ్ళ జనసేన మండల ఇంచార్జ్ ఇరిగెల ప్రతాప్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లో తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పసుల నరేంద్ర జనసేన పార్టీ సిరివెళ్ల మండలం కన్వీనర్ ఆలమూరు గౌస్, పెసరాయి చాంద్ బాషా, ఇబ్రహీం ఖాన్, పల్లె సాగర్ బండెద్దుల ఖాదర్, పెద్ద బాలయ్య, తేజ, నాగరాజు శెట్టి, షబ్బీర్, మాలి, హనుమంత రెడ్డి, వంశీ, నందీశ్వర్ తదితర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.