వైసీపీ నుంచి జనసేనలోకి కొనసాగుతున్న వలసలు

తిరుపతి, జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి స్థానిక నాయకులు చిన్ని, బాలాజీ, శివ ఆధ్వర్యంలో 49, 50 వార్డులో 100 మంది యువకులు పెద్దలు ఆరణి శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ల సమక్షంలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన, తెలుగుదేశం, బీజీపీ ఉమ్మడి తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ యువత పార్టీలోకి రావడం శుభపరిణామం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు అభివృద్ధి పేరిట అరాచకం సృష్టించారు. ప్రజలు కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి లని ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆధ్యాత్మిక నగరంలో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చూస్తాము అని తెలియచేసారు. భూమన కుటుంభం చేతిలో తిరుపతి జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు మోది అండతో చంద్రబాబు అనుభవంకు తోడు పవన్ యువశక్తితో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ డి3 ఫార్ములాను నమ్ముకున్న జగన్.

  • ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లే వైసిపి ఎన్నికల ఆయుధాలు. ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లను వైసిపి ఆయుధాలుగా మార్చుకుందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. వైసీపీ పార్టీ అరాచక పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులను ప్రజలు గెలిపించేందుకు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు ప్రజల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అని తెలియచేసారు. జనసేన-టిడిపి-బీజీపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు ఖాయమైంది ఆయనను అత్యంత మెజారిటీకి మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర వార్డ్ కమిటీ సభ్యులు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.