వెంకటాపురంలో జనం కోసం జనసేన 491వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 491వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం వెంకటాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 100 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 72300 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల కార్యదర్శి ములపాక విజయ్, వెంకటాపురం నుండి నక్కా లక్ష్మణ్, గోకవరం నుండి ఉంగరాల శివాజీ, కృషునిపాలెం నుండి కరిబండి సాయి పవన్, జనేదుల దుర్గాప్రసాద్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఇటికాయలపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన దారా శ్రీను కుటుంబ సభ్యులకు మరియు పితా సతీష్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.