జె.కొత్తూరులో జనంకోసం జనసేన 495వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 495వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 400 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 73200 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల మీడియా సమాచార కార్యదర్శి సైతన నాగేశ్వరరావు, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, సేనాపతి సాయి, వెంటపాటి దుర్గ, పుగమళ్ళ పెద్దకాపు, సైతన గంగ, పడాల దుర్గ, ద్వారపురెడ్డి ఉమా మహేష్, పుగమళ్ళ రాంబాబు, పందల చక్రయ్య, సిరిమళ్ల రాంబాబు, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్ (బన్ను), గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన బాలిశెట్టి శివ కుటుంబ సభ్యులకు, నకిరెడ్డి విశ్వనాథం కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.